పేదల ఇళ్లు కూలగొడితే చూస్తూ ఊరుకోం: ఈటల రాజేందర్
హైదరాబాద్: పేదల జీవితాలతో ఆటలు వద్దని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మేడ్చల్ జిల్లాలో మూసీ పరివాహక ప్రాంతంలో బీజేపీ నేతలు బుధవారం పరిశీలిస్తున్నారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆధ్వరంలో మూసీ పరివాహక ప్రాంతాలో పర్యటిస్తున్నారు. రామంతాపూర్ లోని బాలకృష్ణనగర్ ను నేతలు పరిశీలిలించారు. తమ ఇళ్లు కూల్చకుండా చూడాలని స్థానికులు ఈటలను కోరారు.
ఎన్నో కష్టాలుపడి ఇల్లు కట్టుకున్న వారిని ఆందోళనకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30-40 ఏళ్ల పాటు కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇల్లు కట్టుకున్నారని తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారని ఈటల రాజేందర్ విమర్శించారు. శని, ఆదివారం వస్తే చాలు.. వీరంతా భయబ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. పేదల ఇళ్లు కూలగొడితే చూస్తూ ఊరుకోం, బాధితులకు మద్దతుగా ఇందిరాపార్కు దగ్గర ధర్నా చేస్తామని హెచ్చరించారు.