calender_icon.png 7 October, 2024 | 8:51 PM

ప్రత్యేక ఓటర్ నమోదు కేంద్రం ఏర్పాటు

07-10-2024 06:41:25 PM

మంచిర్యాల (విజయక్రాంతి): ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎంఎల్సి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినందున జిల్లాలో జిల్లాలో ప్రత్యేక ఓటర్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎం. ఎల్. సి. ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులైన వారు తమ ఓటు నమోదు చేసుకోవాలని, పట్టభద్రుల ఎం. ఎల్. సి. కొరకు ఫార్మ్ 18, ఉపాధ్యాయుల ఎం. ఎల్. సి. కొరకు ఫార్మ్ 19 ద్వారా వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు ఫారాలను నింపి పాస్ ఫోటో, సంబంధిత పత్రాలు జత చేసి తహసిల్దార్ కార్యాలయం /  జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమర్పించవచ్చని, ఆన్ లైన్ లో సి.ఈ.ఓ. తెలంగాణ వెబ్ సైట్ లో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎం.ఎల్.సి. ఓటు నమోదు చేసుకోవడానికి నవంబర్ 6 చివరి తేదీ అని, ఈ అవకాశాన్ని అర్హత గల వారు అందరూ వినియోగించుకోవాలని తెలిపారు.