calender_icon.png 22 September, 2024 | 7:03 PM

విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలలో జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతులు

22-09-2024 04:56:49 PM

వశిష్ట ఇంపల్స్ ఈ టెక్నో స్కూల్ విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలలో జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతులు .

నిర్మల్,(విజయక్రాంతి): ముచ్చింతల్ లోని శ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో ప్రజ్ఞా వికాస్ వారు వ్యాస రచన, చిత్రలేఖనం పోటీ నిర్వహించారు. ఈ పోటీల్లో నిర్మల్ జిల్లాస్థాయిలో వశిష్ట ఇంపల్స్ ఈ టెక్నో స్కూల్ విద్యార్థులు మలిహ తస్కిన్ 10వ తరగతి వ్యాసరచన, సాత్విక -9వ తరగతి -చిత్రలేఖన పోటీల్లో ప్రథమ బహుమతులు పొందారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ప్రశంసా పత్రం, 3000/- రూపాయలు నగదు బహుమతిని అందింజేసారు .జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతులు పొందిన విద్యార్థులను పాఠశాల చైర్మన్ గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ అభినందిస్తూ విద్యార్థులకు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలలో కావాల్సిన తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు .ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ గొల్లపల్లి మాధవి, పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ డెవిడాస్ పాల్గొన్నారు .