జిల్లా స్థాయిలో ఉత్తమ వ్యాసాలకు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ఎస్పీ చెన్నూరి రూపేష్..
సంగారెడ్డి (విజయక్రాంతి): పోలీసుల ప్రతిమను వెలికి తీసేందుకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నా, జిల్లాస్థాయిలో ఉత్తమ వ్యాసరచనకు ఎంపికైన రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ తెలిపారు. ఆదివారం సంగారెడ్డి పట్టణంలో పోలీసులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పోలీస్ అమరవీరుల ప్రాణత్యాగాలను స్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీ నుండి ఏక్కా దివాస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి 31వ పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాలు నిర్వహిస్తారు అన్నారు. వారోత్సవాల్లో పోలీసు కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులకు, సిబ్బందికి, సమాజంలో పోలీసు ప్రతిష్టను మెరుగుపరచడంలో నా పాత్ర అనే అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు. పోటీలలో ఉత్తమంగా నిలిచిన మూడు వ్యాసాలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.