12-03-2025 12:00:00 AM
హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డా. జి.రమేశ్వర్రావు మంగళవారం సీనియర్ అధికారుల సమక్షంలో 2025 సంవత్సరానికి సంబంధించిన వార్షిక శిక్షణ కార్యక్రమాల షెడ్యూల్ను ఆవిష్కరించారు. 7,000 మంది అధికారులకు 400 శిక్షణ కార్యక్రమాల ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మా శిక్షణ కార్యక్రమాలను ఖచ్చితంగా అ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ శిక్షణ కార్యక్రమాలు ఏప్రిల్ 20 నుంచి మార్చి 2026 వరకు కొనసాగనున్నాయి. ప్రపంచ స్థాయి నూతన సాం పరిజ్ఞానాన్ని అనుసరించి ఈ శిక్షణ కార్యక్రమాలను రూపొందించామని డా.ర తెలిపారు.
దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాకల్టీ సభ్యులందరూ ఈ శిక్షణ కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ ఆసియాలో ఇంజినీర్లకు ప్రత్యేక శిక్షణ అందించే ఏకైక సంస్థ అని ప్రకటించారు. ఈ ఏడాది 400కు పైగా ప్రాముఖ్యత గల శిక్షణ అంశాలను ఇందులో భాగంగా చే పీజీ స్టడీస్ స్కూల్ ద్వారా ఏఐసీటీఈ గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ కోర్సు విద్యార్థులకు అందించడంతో పాటు, ప్లేస్మెంట్ సాయాన్ని కూడా అందజేస్తుంది. ఈ కార్యక్రమానికి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ డా. కృష్ణ ప్రసాద్రావు, డా. వెంకట్రెడ్డి, డా. చంద్రకళ, డా. పి.శ్రీధర్, డా. సాగర్, డా. పి.రాజారావు, సయ్యద్ అంగర్, డా. భరత్, శ్రీధర్బాబు, ఎస్. లక్ష్మికాంతరావు, కె.జె. అనిత అగర్వాల్, సాయి కిషోర్, డా. నరేష్, సి.హెచ్. తిలక్ హాజరయ్యారు.