21-03-2025 12:00:00 AM
బేబీ డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సం యుక్తంగా నిర్మిస్తున్న “ఎర్రచీర - ది బిగినింగ్” చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ మనవరా లు బేబీ సాయి తేజస్విని నటిస్తుండగా, దర్శకుడు సుమన్ బాబు స్వీయ దర్శకత్వంలో ఒక కీలక పాత్ర లో కనిపించనున్నారు. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాలతో కూడిన ఈ చిత్రం మొదట శివరాత్రి కానుకగా విడుదల కావాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఇ ప్పుడు వేసవి సీజన్లో ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముం దుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. సందర్భంగా నిర్మాతఎన్వీవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, “ఈ చిత్రంలో క్లైమాక్స్ ఎపిసోడ్, అనేకమంది అఘోరాలతో శివుడిని అత్యద్భుతంగా చూపి స్తూ షూట్ చేసిన సీక్వెన్స్ అద్భుతంగా వచ్చింది” అని అన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు సుమన్ బాబు మాట్లాడుతూ.. ఈ సినిమాలో 45 నిముషాల పాటు ఉండే గ్రాఫిక్స్ చాలా హైలైట్గా నిలుస్తాయన్నారు.