16-02-2025 12:15:50 AM
పీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్గౌడ్
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్గౌడ్ పేర్కొన్నారు. పూర్తి మెజార్టీతో ప్రజాస్వామ్యంగా ఏర్పడిన ప్ర భుత్వం పడిపోతుందనడం ఆయన అధికార దాహానికి నిదర్శమని శనివారం ఒక ప్రకటనలో విమ ర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యేల జోలికి వస్తే తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు. రాజకీయంగా ఆదరించి అందలం ఎక్కించిన టీడీపీని ఎర్రబెల్లి మోసం చేసి, టీడీపీఎల్పీని బీఆర్ఎస్లో విలీనం చేశారని మండిపడ్డారు.