calender_icon.png 13 October, 2024 | 7:55 AM

వసూల్ రాజా దూకుడుకు పోలీసుల ముకుతాడు...

11-09-2024 01:34:22 PM

"ఇనుముల " అంగరక్షకుడి అటాచ్డ్...?

 హర్షం వ్యక్తం చేస్తున్న మంథని పుర ప్రజలు...

మంథని,(విజయక్రాంతి): మంథని లో వసూల్ రాజా దూకుడుకు పోలీసులు ముకుతాడు బిగిస్తున్నారు. చట్టం ఎవరికి చుట్టం కాదని మరోసారి నిరూపిస్తున్నారు. గత కొంతకాలంగా మంథనిలో  హద్దు మీరుతున్న వసూల్ రాజా ఆగడాలకు దిగ్బంధనం దిశగా చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు మంథని మాజీ ఉపసర్పంచ్ ఇనుముల సత్యనారాయణపై ఇటీవల మంథని పోలీసులు కేసు నమోదు చేయగా, తాజాగా అతని అంగరక్షకుడిని రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంకు అటాచ్డ్ చేసినట్లు సమాచారం. మంథని పట్టణంలో మల్లారెడ్డి అనే వ్యక్తి సొంతగా ఇల్లు నిర్మించుకుంటుండగా, మాజీ ఉపసర్పంచ్ ఇనుముల సత్యనారాయణ ఇల్లు నిర్మాణం సాఫీగా జరగాలంటే అందుకు తనకు రూ. ఐదు లక్షలు ఇవ్వాలంటూ మల్లారెడ్డిని  బెదిరించాడు.

అప్పటికి  రూ.2 లక్షలు ముట్ట చెప్పగా, అది చాలాదంటూ మరో మూడు లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఇనుమల సతీష్ వేధింపులు తాళలేక మల్లారెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో మంథని పోలీస్ స్టేషన్లలో కేసు నమోదైన విషయం విధితమే. ఈ క్రమంలో సంఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు శాఖపరమైన చర్యల్లో భాగంగా ఇనుముల సత్యనారాయణ గన్మెన్ ను సిపి కార్యాలయం కు అటాచ్డ్ చేసినట్లు సమాచారం. పోలీస్ అధికారుల చర్య పట్ల మంథని పుర ప్రజల నుంచి సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంథనిలో ఇంకా వసూల్ రాజాలపై పోలీసులు ఉక్కుపాదం మోపనున్నట్లు తెలుస్తుంది.