24-02-2025 12:38:22 AM
నిర్మల్ ,ఫిబ్రవరి 23 (విజయ క్రాంతి) : నిర్మల్ జిల్లాలో ఐదవ తరగతి ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన టిజిసెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్టు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.
జిల్లా కేంద్రంతో పాటు బైంసా ముధోల్ కుంటాల ఖానాపూర్ దగ్గర ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు పరీక్షకు హాజరైనట్టు తెలిపారు. పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా విద్యాశాఖ అధికారులు ఆయా కేంద్రాలను తనిఖీ నిర్వహించి ఎలాంటి ఇబ్బందులు కలకుండా అన్ని చర్యలు తీసుకున్నారు.