మహబూబాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): ఆసుపత్రులలో స్కానింగ్ చేయించుకునేందుకు వచ్చిన వారి వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని మాతా శిశు సంక్షేమ ప్రోగ్రాం అధికారి సారంగం ఆదేశించారు. గురువారం తొర్రూరు పట్టణంలోని హాస్పిటల్స్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పరీక్షల ధరల వివరాల పట్టికను దవాఖాన ఆవరణలో ప్రదర్శించాలని, 16 ఫారం ఎఫ్ రికార్డులు సక్రమంగా ఉండాలని సూచించారు. ఈ రికార్డులను ప్రతి నెల 5 లోపు జిల్లా కార్యాలయంలో అందజేయాలని చెప్పారు. లింగ నిర్ధారణ, ఎంటీపీ నియమాలకు విరుద్ధంగా అబార్షన్లు చేయరాదని హెచ్చరించారు.