calender_icon.png 25 October, 2024 | 7:59 AM

ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు నిర్మాణాలను నేలమట్టం చేసిన అధికారులు

25-10-2024 01:05:06 AM

ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు

నిర్మాణాలను నేలమట్టం చేసిన అధికారులు

రాజేంద్రనగర్, అక్టోబర్24: అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ అధికారులు కొరడా ఝులిపించారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ఏర్పాటు చేసిన షాపులను తొలగించారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ మధుబన్ కాలనీలో రోడ్డు పక్కన, అదేవిధంగా ఫుట్‌పాత్‌లపై సుమారు 200 షాపులు అక్రమంగా వెలిశాయి. దీంతో ప్రతిరోజు ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌కు తీవ్రఅంతరాయం ఏర్పడుతోంది. స్థానికుల ఫిర్యాదు మేరకు డిప్యూటీ కమిషనర్ రవికుమార్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీధర్ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి గురువారం ఆయా ఆక్రమణలను తొలగించారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది తదితరులు ఉన్నారు.