ఇద్దరు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్, అక్టోబర్ 5: జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో భారత్ పాకిస్థాన్ సరిహద్దులో చొరబాటు యత్నాన్ని భద్రతా బలగాలు, జమ్మూ పోలీసులు భగ్నం చేశారు. అక్రమ చొరబాటు నియంత్రించే క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా భారత ఆర్మీ జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కొన్ని గంటల పాటు కొనసాగిన ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన జవాన్లు వారినుంచి మందుగుండు సామగ్రి, ఆయుధాల ను స్వాధీనం చేసుకున్నారు. కుప్వారా జిల్లాలోని బార్డర్ ప్రాంతమైన గుగల్ధార్ వద్ద ఉగ్రవాదులు భారత్లో చొరబడేందుకు యత్నించారని.. వారి ని హతమార్చామని సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని సైన్యం తెలిపింది.