ఎమ్మెల్యే మక్కాన్ సింగ్
పెద్దపల్లి, అక్టోబర్ 14 (విజయక్రాంతి): ఓపెన్ కాస్ట్ మైనింగ్లో స్థానికులకు ఉపాధి లభించేలా చర్యలు తీసుకుంటానని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు. సోమవారం గోదావరిఖనిలో సింగరేణి అర్జీ అధ్వర్యంలో నిర్వహించిన యువత కు ఉపాధి శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభు త్వం సింగరేణి అధ్వర్యంలో యువతకు నైపు ణ్య శిక్షణ కేంద్రాన్ని రామగుండంలో ఏర్పా టు చేసిందన్నారు. ఎల్ అండ్ టీ, ఐసీఐసీ వంటి సంస్థల సహకారంతో శిక్షణ అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
మంత్రి శ్రీధర్ బాబు సహకరంతో రామగుండంలో ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్టీ జీఎం లలిత్ కుమార్, ఏసీపీ మడల రమేష్, ఎస్ఈడబ్యూ ఏ అధ్యక్షులు అనితలలితకుమార్ పాల్గొన్నారు.