calender_icon.png 23 October, 2024 | 4:55 AM

తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన ఉపాధి కూలీలు

17-05-2024 12:56:33 PM

కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల తహసీల్దార్ కార్యాలయాన్ని ఉపాధి హామీ కూలీలు శుక్రవారం ముట్టడించారు. 600 మంది ఉపాధి హామీ కూలీలు ట్రాక్టర్లతో తహసీల్దార్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. ఉపాధి పనులను చుట్టుపక్కల రైతులు అడ్డుకుంటున్నారని నిరసనకు దిగారు. ఐలాపూర్ మేజర్ గ్రామంలో చెరువులో కూలీలు ఉపాధి పనులకు వెళ్తున్నారు. వారం రోజులుగా ఉపాధి పనులు నిలిచిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు పని కల్పించాలని తహసీల్దార్ కు ఉపాధి కూలీలు విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ కిషన్ సోమావరం చెరువును పరిశీలించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.