*ప్రజా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్కుమార్
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 18 (విజయక్రాంతి): ఉద్యోగుల పీఆర్సీపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించడంతో పాటు పెండింగ్లో ఉన్న 5 డీఏలను వెంటనే విడుదల చేయాలని ప్రజా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.దాసరి అజయ్కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశం లో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రె స్ అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నా ఉద్యోగులకు డీఏ లు విడుదల చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వం 2 డీఏలను పెండింగ్లో ఉంచిదని ఉద్యోగు లు కాంగ్రెస్ను గెలిపించారని అన్నా రు. కనీసం ఆరు నెలలకోసారి రెగ్యులర్గా డీఏలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల మద్ధతు ఉంటుందని అజయ్కుమార్ స్పష్టం చేశారు.