calender_icon.png 3 October, 2024 | 4:23 PM

తహసిల్దార్ కార్యాలయంలో నిలిచిపోయిన సేవలు

03-10-2024 01:55:02 PM

బెల్లంపల్లి (విజయ క్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో నాలుగు రోజులుగా విద్యుత్ లేక సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కార్యాలయంలో విద్యుత్ లేకపోవడంతో కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు అందక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాలయంలో విద్యుత్ లేక ధ్రువీకరణ పత్రాల జారి ప్రక్రియ నిలిచిపోవడంతో విద్యార్థులు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు చెట్ల కింద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి తలెత్తింది. సంబంధిత అధికారులు చొరవ తీసుకొని తహసీల్దార్ కార్యాలయానికి విద్యుత్ పునరుద్ధరణ జరిగేలా చూడాలని లబ్ధిదారులు, విద్యార్థులు వేడుకుంటున్నారు.