రెఖ్య తండా వద్ద ప్రమాదకరంగా విద్యుత్ తీగలు.. పట్టించుకోని అధికారులు
కడ్తాల్, ఫిబ్రవరి 2 ( విజయ క్రాంతి ) : కడ్తాల్ -తలకొండపల్లి ప్రధాన రహదారి రెఖ్య తండా వద్ద ప్రధాన రోడ్డు పక్కన విద్యుత్ స్థంభం కిందకు ఉండడంతో చేతికి అందే విదంగా తీగలు ఉండడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుం దోనని ఆందోళన చెందుతున్న పరిస్థితి. విద్యుత్ శాఖ అధికారులకు వివరించిన పట్టించుకోవడం లేదని తండా ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి వైర్లు ఎత్తుకు పెంచాలని తండా ప్రజలు కోరుతున్నారు.