calender_icon.png 22 October, 2024 | 3:00 PM

గురుకుల పాఠశాలలో విద్యార్థులకు విద్యుత్ షాక్

22-10-2024 12:32:15 PM

నలుగురు విద్యార్థులకు గాయాలు 

మెదక్ (విజయక్రాంతి): విద్యుత్ షాక్ తగిలి నలుగురు విద్యార్థినులకు గాయాలైన ఘటన హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలో మహాత్మ జ్యోతి రావ్ పూలే గురుకుల పాఠశాలలో మంగళవారం ఉదయం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. జిల్లా స్థాయి గురుకుల క్రీడా పోటీలకు గురుకుల పాఠశాల వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా స్పోర్ట్స్ ఫ్లాగ్ ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఇనుప రాడ్ విద్యుత్ తీగలకు తాకింది. దీంతో రాడ్ పట్టుకున్న రజిత, వసంత, అనుష్క, గాయత్రిల చేతులకు షాక్ కొట్టింది. దీంతో వెంటనే వారిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చేతులకు గాయాలైనట్లు తెలిపారు. రజిత ఇంటర్ చదువుతుండగా మిగతా విద్యార్థినిలు పదో తరగతి చదువుతున్నారు. పరామర్శించిన మెదక్ ఆర్డీవో రమాదేవి.. విద్యుత్ గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి, ప్రమాదంపై అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.