69.65 శాతం పోలింగ్ నమోదు
జమ్ముకశ్మీర్, అక్టోబర్ 1: జమ్ముకశ్మీర్లో చివరిదైనా మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చివరిదశలో 69.65 శాతం ఓటింగ్ శాతం నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ విడతలో కీలకమైన జమ్ము, బందిపూర్, బారాముల్లా, కథువా, కుప్వారా, సాంబా, ఉధంపూర్ స్థానాలు కలిపి మొత్తం 40 స్థానాలకు పోలింగ్ జరిగింది.
ఈ స్థానాలకు 415 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో కాంగ్రెస్కు చెందిన మాజీ ముఖ్యమంత్రులు తారాచంద్, ముజఫర్ బేగ్ కూడా ఉన్నారు. మొత్తం మూడు దశల్లో కలిపి రికార్డు స్థాయిలో 65.58 శాతం పోలింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 8న జరగనుంది.