20-04-2025 04:20:18 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల నూతన కమిటీని ఆదివారం డిపో ఆవరణలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా మల్లేశం, కార్యదర్శిగా దివాకర్, ఉపాధ్యక్షులుగా పాషా, ప్రభాకర్ రావు, లింగయ్య, సహాయ కార్యదర్శులుగా మహబూబ్, మోహన్, భూమన్న, కోశాధికారిగా టీ.ఎం సింగ్, ప్రచార కార్యదర్శిగా ఆరిఫ్ అలీ లను ఎన్నుకున్నారు. ఎన్నికలు ఉద్యోగుల రాష్ట్ర సహాయ కార్యదర్శి రామచందర్, రీజినల్ అధ్యక్షుడు హనుమంతరావు, రీజినల్ ముఖ్య సలహాదారుడు సత్యనారాయణ, ఆర్గనైజేషన్ సెక్రటరీ నర్సింగ్ పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించారు.