22-04-2025 12:00:00 AM
మంథని ఎప్రిల్ 21(విజయ క్రాంతి) మండలంలోని రచ్చపల్లి గ్రామంలో సోమవారం యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. ఎన్నిక ఎలక్షన్స్ అధికారి శివ ప్రసాద్ ఆధ్వర్యంలో 9 మంది సభ్యులుతో ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. అధ్యక్షులు గా సింగనవేన మల్లేష్. ఉపాధ్యక్షులుగా ఏదండ్ల సమ్మయ్య. ప్రధాన కార్యదర్శి అసరి నాగరాజు. డైరెక్టర్ కనవేన కొమురయ్య, సంజీవ్. కొడారి కుమార్. సింగనవేన ఓదెమ్మ.
కనవేన రజిత. కనవేన రమేష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులు సింగనవేన మల్లేష్ యాదవ్, మాట్లాడుతు యాదవ్ సంఘ సభ్యుల కోసం ప్రభుత్వం నుండి ఏలాంటి ఉపాధి అవకాశాలు వచ్చిన సమన్వయంతో లబ్ధిదారులకు అందేలా కృషి చేస్తానని, నాకు అవకాశం కల్పించిన గ్రామ యాదవ్ సంఘం నాయకులకు సభ్యులకు ధన్యవాదములు తెలిపారు.ఈ కార్యక్రమం లో రచ్చపల్లి యాదవ సంఘ సభ్యులు పాల్గొన్నారు.