10-03-2025 12:00:00 AM
తాడువాయి, మార్చి 9 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామ ఆర్యక్షత్రియ సంఘం నూతన కార్యవర్గం ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా ఎండిగే విఠల్ రావు, ఉపాధ్యక్షుడిగా గనిష్యం రమేష్ రావు, కోశాధికారిగా హారాలే బాపురావు, సెక్రటరీగా దేవునిపల్లి రాజులను ఎన్నుకున్నారు. అనంతరం నూతన అధ్యక్షులు విట్టల్ రావు మాట్లాడుతూ, సంఘ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.