calender_icon.png 26 October, 2024 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీడియో, ఫోటో జర్నలిస్ట్స్ నూతన కమిటి ఎన్నిక

15-09-2024 06:55:21 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా ఫోటో అండ్ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. మంచిర్యాల జిల్లా కమిటీ నూతన అధ్యక్ష , ప్రధాన కార్యదర్శిగా కొత్తపల్లి సతీష్, మదరబోయిన శ్రీనివాస్ ను ఓటింగ్ ద్వారా సభ్యులు ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్, సహయ కార్యదర్శిగా శ్రీకాంత్, కోశాధికారిగా రఘు, ప్రచార కార్యదర్శిగా రాము, గౌరవ అధ్యక్షునిగా ఈసంపల్లి రమేష్ తో పాటు 10 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లను సభ్యులు ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష,  ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమంతో పాటు వారి కుటుంబానికి హెల్త్ కార్డు, ప్రమాద బీమా కల్పించేందుకు కృషి చేస్తామని, ప్రభుత్వం నుంచి రావాల్సిన హక్కుల సాధన కోసం, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామన్నారు. ఎన్నికల అధికారులుగా జుట్టు రమేష్, అనుమాండ్ల శ్రీనివాస్, ఈసంపల్లి రమేష్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వివిధ టీవీ ఛానల్ కు చెందిన వీడియో జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు, స్టింగర్స్ పాల్గొన్నారు.