ముషీరాబాద్, సెప్టెంబర్ 20: తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ట్రస్మా వ్యవస్థాపక అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి, కన్వీనర్ సీహెచ్ లయన్ రాంచందర్, కో కన్వీనర్ కే అనంతరెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వారు బషీర్బాగ్లో మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు 25 జిల్లాల నుంచి ట్రస్మా ప్రతినిధులు హాజరై నూతన కమిటీని ఎన్నుకున్నట్లు వెల్లడించారు. అధ్యక్ష, కార్యదర్శులుగా ఎస్ నర్సిరెడ్డి, కే అనిల్ కుమార్ను ఎన్నుకున్నట్లు తెలిపారు.