బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణ గంగపుత్ర సంఘం నూతన కమిటీని ఆదివారం స్థానిక తిలక్ స్టేడియంలో నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల కమిటీ చైర్మన్ దామెర సదానందం, జిల్లా ఉపాధ్యక్షులు డోలి సుధాకర్, చీఫ్ అడ్వైజర్ భాష బోయిన పోతరాజు ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో బెల్లంపల్లి పట్టణ గంగపుత్ర సంఘం అధ్యక్షులుగా వంగళ చక్రపాణి, కార్యదర్శులుగా మాదర బోయిన మల్లేష్, దామెర విజయ్ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణంలో గంగపుత్ర సంఘం అభివృద్ధికి తమవంతుగా పాటుపడతామని నూతనంగా ఎన్నికైన అధ్యక్ష ,కార్యదర్శులు తెలుపారు.