calender_icon.png 14 October, 2024 | 6:53 AM

వృద్ధ దంపతుల ఆత్మహత్య!

14-10-2024 12:32:02 AM

ఘటనపై పలు అనుమానాలు 

దంపతులిద్దరూ కాంగ్రెస్ నాయకులు 

ఖమ్మం, అక్టోబర్ 13 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం కేంద్రంలో కాంగ్రెస్ నాయకులైన వృద్ధ దం పతుల మృతి కలకలం రేపింది. రేమిడి చర్ల గ్రామానికి చెందిన ఎర్రుపాలెం సొసైటీ మా జీ అధ్యక్షుడు ధనేకుల సాంబశివరావు(72), మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ  డైరెక్టర్ ధనేకుల సరోజిని(65) దంపతులు. వీరు ఎర్రుపాలెంలో నివాసము ంటున్నారు.

శనివారం రాత్రి వారు ఉంటు న్న ఇంట్లో వి గతజీవులై కనిపించారు. అనారోగ్య కారణాలతో  ఆత్మహత్య చేసుకున్నట్లు నోట్ రాసి పెట్టారు. గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పా ల్పడినట్టు సమాచారం. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.