calender_icon.png 9 October, 2024 | 10:23 PM

తమ్ముడిని హత్య చేసిన అన్న

09-10-2024 08:41:44 PM

హుజురాబాద్,(విజయక్రాంతి): మానవ సంభంధాలు మంట కలుస్తున్నాయి. ఇతర వివాదాల కారణంతో ఏదైనా రక్త సంబందం అని కూడా చూడకుండా దాడులు చేస్తూ హతమారుస్తున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపుర్ మండలం, దుద్దెనపల్లి గ్రామంలో తమ్మున్ని స్వంత అన్న ఇనుప రాడ్ తో కొట్టి హత్య చేశాడు. దుద్దెనపల్లి గ్రామానికి చెందిన కుందేళ్ళ చంద్రమోహన్, కుందేళ్ళ కుమారస్వామి ఇద్దరు అన్నదమ్ములు. ఇందులో ఒకరు వ్యవసాయం చేసుకుంటుండగా మరొకరు హమాలీ పని చేసుకుంటూ.. జీవనం సాగిస్తున్నారు. కుమారస్వామికి వివాహం కాగా చంద్రమోహన్ కు ఇంకా వివాహం కాలేదు. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. గత రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరుగడంతో మద్యం మత్తులో ఉన్న కుమారస్వామి తమ్ముడు చంద్రమోహన్ పై ఇనుప రాడ్ తో దాడి చేసి హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.