calender_icon.png 24 October, 2024 | 5:56 AM

భవనం కూలి 8 మంది మృతి

24-10-2024 01:43:52 AM

బెంగళూరు, అక్టోబర్ 23: ఉత్తర బెంగళూరులోని నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం కూలిన ఘటనలో 8 మంది మరణించారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. మరికొంతమంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భవన యజమాని మునిరాజు రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి నిర్లక్ష్యానికి పాల్పడ్డాడని కేసు నమోదు చేశారు. వర్షం కారణంగా భవనం కూలిపోలేదని, నాణ్యత లేని మెటీరియల్, నాసికరం నిర్మాణమే కారణమని అధికారులు వెల్లడించారు. భవనం కూలుతున్న దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి. ఈ భవనానికి నాలుగు అంతస్తులకే అనుమతి ఉందని, నిర్మాణ ఉల్లంఘన కూడా జరిగిందని విశ్వసనీయ సమాచారం.