న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా సమీపంలోని సింథాన్-కోకెర్నాగ్ రోడ్డులో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని దక్సుమ్ ప్రాంతంలో కారు లోయలో పడి ఇద్దరు మైనర్లతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది వ్యక్తులు మరణించారు. బాధితుల్లో ఓ వ్యక్తి, ఇద్దరు మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారని, వారు కిష్త్వార్ నుంచి వస్తున్నారని పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్ కారుపై నియంత్రణ కోల్పోయాడని వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సహాయకచర్యలు ప్రారంభించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం కేసు దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. యూనియన్ టెరిటరీలోని రాజౌరి, రియాసి జిల్లాల్లో వరుసగా రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మరణించిన కొద్ది రోజుల తర్వాత ఈ ఘటన జరిగింది.