20-04-2025 01:02:20 AM
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: ఆఫ్రికా దేశమైన బోట్స్వానా నుంచి భారత్కు 8 చీతాలు రానున్నాయి. ఈ చీతాలను రెండు విడుతల్లో తీసుకురానున్నారు. మేనెలలో మొద టి విడుతలో నాలుగు చీతాలు రానున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
ఇందుకు సంబంధించి మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ (ఎన్టీసీఏ) సమాచారం ఇచ్చింది. కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఎంపీ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నేతృత్వంలో శుక్ర వారం జరిగిన ప్రాజెక్ట్ చీతా సమీక్ష సమావేశంలో ఎన్టీసీఏ అధికారులు ఈ విషయం వెల్లడించారు.
ఇప్పటికే రూ.112 కోట్లు
భారత్లో ప్రాజెక్ట్ చీతా కోసం ఇప్పటికే రూ. 112 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ నిధుల్లో సింహభాగం మధ్యప్రదేశ్లో చీతాల పునరావాసా నికే ఖర్చు చేశామని ఎన్టీసీఏ అధికారులు పేర్కొన్నారు. ‘దక్షిణాఫ్రికా, కెన్యా, బోట్స్వా నా దేశాల నుంచి భారత్కు మరిన్ని చీతాల ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తు న్నాం.
బోట్స్వానా నుంచి ఎనిమిది చీతాలను రెండు విడుతల్లో తీసుకురాను న్నాం. మొదటి విడుతలో బోట్స్వానా నుం చి ఈ మేలో నాలుగు చీతాలను తీసుకొచ్చేందుకు ప్రణాళిక రచించాం. ఆ తర్వాత మరో నాలు గు చీతాలను కూడా తీసుకొస్తాం. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ప్రస్తుతం చిరుతలను కూనో నేషనల్ పార్క్ నుంచి రాజస్థాన్ సరిహద్దుల్లో ఉన్న గాంధీ సాగర్ అభయార ణ్యానికి దశలవారీగా తరలించనున్నట్టు వెల్లడించారు.
రాజస్థాన్ మధ్య అంతర్రాష్ట్ర చిరుత సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా అం గీకారం కుదిరింది’ అని ఎన్టీసీఏ అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం కూనో జాతీయ పార్కులో 26 చీతాలు ఉన్నాయని, వాటిలో 16 బహిరంగ అడవుల్లో, 10 ఎన్క్లోజర్లలో ఉన్నట్టు వివరించా రు. ఆడ చీతాలు జ్వాలా, ఆశా, గామిని, వీరా పిల్లలకు జన్మనివ్వడంతో చీతాల సంఖ్య 26 కు చేరుకుంది.
కునోలో చీతా సఫారీ కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీం నిర్ణ యం తీసుకోవాల్సి ఉంది. 2022లో నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చీతాల ను కునో నేషనల్ పార్కులో వదిలారు. వాటిల్లో ఐదు ఆడచీతాలు, మూడు మగ చీతాలు ఉన్నాయి.