calender_icon.png 4 October, 2024 | 10:44 PM

గ్రామాల్లో మొక్కల పంపిణీపై ఈజీఎస్ సిబ్బంది సర్వే

04-10-2024 08:14:25 PM

మందమర్రి,(విజయక్రాంతి): మండలంలోని 10 గ్రామపంచాయతీలలో ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్వహిస్తున్న నర్సరీలలో మొక్కలను సంరక్షించి గ్రామీణులకు అవసరమైన మొక్కలను సర్వే నిర్వహించి పంపిణీ చేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేశ్వర్ ఆదేశించారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో గ్రామస్థులకు అవసరమైన మొక్కలపై ఉపాధి హామీ సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి వివరాలు నమోదు చేశారు. ఈ సందర్బంగా ఆయా గ్రామాల్లో ప్రజలు కొబ్బరి, జామ, మామిడి, సపోటా,మల్లె, గులాబీ,చామంతి,వంటి మొక్కలపై గ్రామస్థులు ఆసక్తి వ్యక్తం చేశారని ఉపాధి సిబ్బంది తెలిపారు.