calender_icon.png 26 October, 2024 | 7:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్ట్ ల సమస్యలను పరిష్కరిచేందుకు కృషి చేస్తా : ఉప్పల్ ఎమ్మెల్యే

26-10-2024 05:53:28 PM

కాప్రా, (విజయక్రాంతి): జర్నలిస్టు సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేయనున్నట్లు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కాప్రా సర్కిల్ నూతన ప్రెస్ క్లబ్ కమిటీ ప్రమాణస్వీకారానికి ముఖ్యఅతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, టీయుడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, డివిజన్లో కార్పోరేటర్లు  హాజరయ్యారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ.. తన దృష్టికి వచ్చిన జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

నూతనంగా అధ్యక్షుడైన శ్రీనివాస్ చారి, ప్రధాన కార్యదర్శి శంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ కుమార్, కోశాధికారి నర్సింగ్ గౌడ్, కమిటీ సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు మోత వెంకటరెడ్డి, కార్పొరేటర్లు దేవేందర్ రెడ్డి, ప్రభుదాస్, బొంతు శ్రీదేవి మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, పావని మణిపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, ప్రవీణ్ ముదిరాజ్, సాయి జెన్ శేఖరలతో పాటు సంఖ్యలో పాత్రికేయులు పాల్గొన్నారు.