calender_icon.png 11 October, 2024 | 4:48 PM

పట్టభద్రులకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి

10-10-2024 12:19:14 AM

అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి

మంథని, అక్టోబర్ 9 (విజయక్రాంతి): పట్టభద్రులకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తానని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి అన్నారు. కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మంథనిలో పర్యటించారు. మంథని చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందకు కృషి చేస్తానన్నారు. న్యాయవా దులకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకువచ్చేందకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని చెప్పారు. ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు.