25-03-2025 12:40:03 AM
సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు, మాజీ శాసనసభ్యుడు పల్లా వెంకటరెడ్డి
సూర్యాపేట, మార్చి24(విజయక్రాంతి): సిపిఐ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలని పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు పల్లా వెంకటరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో జెకె ఫంక్షన్ హాల్ లో సోమవారం పట్టణ, మండల కౌన్సిల్ సమావేశం సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ నెల్లి కంటి సత్యం నుఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా మునుగోడు ప్రాంతానికి చెందిన సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు నెల్లికంటి సత్యం ను ఎంపిక చేయడం హర్షణీయమని తెలిపారు.
ఎమ్మెల్సీ ఉండడం వలన ఉమ్మడి జిల్లాకు న్యాయం జరుగుతుందని, ఈ పదవి సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, గన్నా చంద్రశేఖర్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఉస్స్తెల సృజన పాల్గొన్నారు.