18-02-2025 05:09:26 PM
ఐటీడీఏ పీవో కుష్బూ గుప్త...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేయాలని ఐటిడిఏ పిఓ కుష్బూ గుప్త అన్నారు. మంగళవారం టీఎస్టి డబ్ల్యూ టియు డైరీని సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిఓ మాట్లాడుతూ... ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు అశోక్ ఆదిలాబాద్ జిల్లా గౌరవ అధ్యక్షుడు లక్ష్మణ్, కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు రవీందర్, వివిధ సంఘాల నాయకులు కృష్ణారావు, గోపాల్, శివాజీ, నారాయణ, జగ్గారావు, హనుమంతరావు, చంపావతి, మున్నిబాయి తదితరులు పాల్గొన్నారు.