calender_icon.png 18 October, 2024 | 6:54 PM

ఆలయాల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే

18-10-2024 04:09:30 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని అతి పురాతనమైన మహంకాళి ఆలయాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధి కోసం 25లక్షల నిధులను త్వరలో మంజూరయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు దత్తానిక్కం, బీజేవైఎం మండల అధ్యక్షుడు పొతారాజ్ నవీన్, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు రాము బర్కడే, మండల్ జనరల్ సెక్రెటరీ సందీప్ ఠాక్రే, మాజీ సర్పంచ్ ఇంద్ర శేఖర్, గణేష్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.