calender_icon.png 24 October, 2024 | 1:58 PM

కామారెడ్డిలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దాహనం

12-09-2024 01:33:40 PM

అమెరికాలో భారతదేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడినందుకు నిరసిస్తూ ఆందోళన

బిజెపి ఆధ్వర్యంలో రాహుల్ దిష్టిబొమ్మ దహనం

కామారెడ్డి,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో భారత దేశాన్ని కించ పరుస్తూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గురువారం కామారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద బిజెపి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మదాహనం చేశారు. భారతదేశానికి చెందిన వ్యక్తి అయి ఉండి భారతదేశాన్ని కించపరచడం సిగ్గుచేటు అయిన విషయం అని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు రాహుల్ గాంధీ విరమించుకోవాలని భారతదేశ ప్రజలకు క్షమాపణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ బిజెపి అధ్యక్షుడు ఆకుల భరత్ కుమార్ బిజెపి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీకాంత్ గుప్తా కౌన్సిలర్లు శ్రీనివాస్ నరేందర్ పండ్ల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు