కొసరాజు సామ్రాజ్యం సంపాదకత్వంలో ప్రచురితమైన ‘ఎదురు చూపులు’ కవితా సంకలనం ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ శ్రీత్యాగరాయ గానసభలో 11న జరగనుంది. సాహితీ వేత్త డా. వోలేటి పార్వతీశం పుస్తకాన్ని ఆవిష్కరించే ఈ సభకు ‘నేటి నిజం’ సంపాదకులు బైస దేవదాసు అధ్యక్షత వహిస్తారు.
డా. వై.రామకృష్ణారావు, గుదిబండి వెంకటరెడ్డి, డా. పులివర్తి కృష్ణమూర్తి, పొత్తూరి సుబ్బారావు, పెద్దూరి వెంకటదాసు, కొసరాజు రాజేంద్రప్రసాద్, పొత్తూరి జయలక్ష్మి అతిథులుగా పాల్గొంటారు. ఈ సందర్భంగా ‘సాహితీ కిరణం’ సౌజన్యంతో ‘కన్నవారి కలలు -పిల్లల బాధ్యతలు’ అంశంపై నిర్వహించిన కవితల పోటీ విజేతలకు బహుమతి ప్రదానం జరుగుతుంది.
పొత్తూరి సుబ్బారావు