25-02-2025 04:18:24 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని సోమవారం పేట్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థుల విద్యాసామర్థ్యాన్ని ప్రశ్నల రూపంలో అడిగి తెలుసుకున్నారు. బాగా చదివి 10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పరమేశ్వర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.