calender_icon.png 18 March, 2025 | 4:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా ప్రభుత్వంలో విద్య, వైద్యానికి ప్రాధాన్యం

17-03-2025 12:00:00 AM

 మంత్రి పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి 

ఇల్లెందు, మార్చి 16 (విజయక్రాంతి) : ఇందిరమ్మ ప్రభుత్వంలో విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇల్లెందు మండలం పూబల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి, ఇల్లందు పట్టణం జేకే కాలనీలో కొత్తగా మంజూరైన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు పాలించి పేదలకు ఎటువంటి న్యాయం చేయలేదని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంటే చూసి ఓర్వలేక కాకిగోల చేస్తుందని తెలిపారు. వారి విమర్శలు తిప్పికొట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని తెలిపారు.

అందులో భాగంగానే ఇల్లందులో రూ.37.50 కోట్లతో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శంఖుస్థాపన చేసుకున్నట్లు తెలిపారు.  విద్యకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో భాగంగా 58 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి రూ.200 కోట్ల చొప్పున మొత్తం 11,600 కోట్లను కేటాయించుకోని ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. భవిష్యత్తులో అన్ని నియోజకర్గాల్లోనూ ఈ స్కూల్స్ కి శంకుస్థాపన చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గస్థాయి, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఇల్లందు డిఎస్పి చంద్రబాను, సీఐ బత్తుల సత్యనారాయణ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.