calender_icon.png 24 October, 2024 | 2:06 AM

హీరా గ్రూప్‌లో ఈడీ సోదాలు

04-08-2024 02:20:04 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 3 (విజయక్రాంతి): హీరా గ్రూప్ కుంభకోణం వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును వేగవంతం చేసింది. తాజాగా మరోసారి శనివారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నంలోని హీరా గ్రూప్ కార్యాలయాల్లో ఈడీ బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. బంజారాహిల్స్‌లోని నౌహీరాషేక్ ఆఫీస్, ఇళ్లతో పాటు  సంస్థ డైరెక్టర్లు, సీఈవోల ఇళ్లలోనూ రైడ్స్ కొనసాగాయి. గతంలో నమోదైన కేసు ఆధారంగా ఈడీ తాజాగా సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. స్కీముల పేరిట రూ.వేల కోట్ల డిపాజిట్లు సేకరించి మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ నౌహీరా షేక్‌పై ఇప్పటికే దేశవ్యాప్తంగా 60కి పైగా కేసులున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు రూ.380కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అటాచ్ చేసిన వాటిలో.. టోలిచౌకిలోని ఎంఎస్పీ కాలనీలో ఉన్న హీరా గ్రూప్స్‌కు సంబంధించిన  రూ.80కోట్ల విలువైన 81ప్లాట్లు ఉన్నాయి.