- ఉప్పల్ స్టేడియం నిధుల గోల్మాల్ కేసు
- 22న హాజరుకావాలని మూడు కంపెనీలకు నోటీసులు
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 17 (విజయక్రాంతి): ఉప్పల్ స్టేడియంలో నిధుల గోల్మాల్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ నెల 8న హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ను విచారించిన ఈడీ ఆయన స్టేట్మెంట్ ఆధారం గా గురువారం మూడు కంపెనీలకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు రావాలని వాటిని ఆదేశించింది.
స్టేడియం కోసం కొను గోలు చేసిన జనరేటర్స్, జిమ్ పరికరాలు, క్రికెట్ బాల్స్, ఇతర వస్తువు లకు సంబంధించి జరిగిన వ్యవహారంలో ప్రశ్నించేందుకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా, 2020, మార్చి నుంచి 2023, ఫిబ్రవరి మధ్య నిధుల దుర్వినియో గం జరిగిందని, ఆ సమయంలో అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్ ప్రైవేట్ పార్టీలతో కుమ్మక్కై కొనుగోళ్ల డీల్స్ అప్పగించారని హెచ్సీఏ ఆరోపణలు చేయ డంతో రంగంలోకి దిగిన ఈడీ..
మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. అజర్ను సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ.. డిజటల్ పరికరాలు, నేరారోపణ పత్రాలు, లెక్కల్లో చూపని నగదుకు సంబంధించి ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. జనరేటర్స్, ఫైర్ సేఫ్టీ సిస్టమ్, క్యానోపీల సేకరణ కోసం కేటాయించిన రూ.20 కోట్ల నిధుల దుర్వినియోగంపైనా ఆరా తీసినట్లు సమాచారం.