సుడా చైర్మన్ కోమటిరెడ్డి
కరీంనగర్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): కరీంనగర్ సర్వతోముఖాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లా డుతూ.. బీఆర్ఎస్ అవినీతి, బంధు ప్రీతి, గడీలపాలనతో తెలం గాణలో ఆర్థిక విధ్వంసం సృష్టిం చారని ఆరోపించారు.
బీఆర్ఎస్ పాలకులు రాష్ట్రాన్ని దివాలా తీయించి, అప్పుల కుప్పగా మార్చారని మండిప డ్డారు. నాటి మంత్రిగా గంగుల సైతం బాధ్యుడేనని అన్నారు. ఎమ్మెల్యే కమలాకర్ కాంగ్రెస్పై చేసిన ఆరోపణలు చూస్తుంటే దె య్యాలు వేదాలు వల్లిం చినట్టుందని ఎద్దేవా చేశారు. దొంగే దొంగ అన్నట్లు గంగుల నిర్వాకం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.