calender_icon.png 25 February, 2025 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటు హక్కు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించాలి

25-02-2025 01:41:40 AM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి, ఫిబ్రవరి 24 (విజయ క్రాంతి),: ఓటు హక్కు వినియోగించుకునేలా వేసులుబాటు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ అన్నారు. సోమవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27న నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ పూర్వ జిల్లాలతో కూడిన కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రుల, ఉపాద్యాయుల శాసన మండలి ఎన్నికల పోలింగ్ జరగనున్న సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ప్రైవేట్ సంస్థలలో పనిచేస్తున్న వారికి సంబంధిత యాజమాన్యాలు వెసులుబాటు కల్పించాలని జిల్లా కలెక్టర్  ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. 

ఈ నెల 27న (గురువారం) ఉదయం 8.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలోని వ్యాపార, వాణి జ్య, పారిశ్రామిక సంస్థలు, ఇతర అన్ని సంస్థల యాజమాన్యాలు, నిర్వాహకులు తమ సంస్థలలో పని చేసే పట్టభద్రుల నియోజకవర్గాలలో ఓటర్లుగా నమోదైన ఉద్యోగులు, కార్మికులకు ఓటు హక్కు వినియోగించుకునేలా సౌకర్యాలను కల్పించా లని అన్నారు.

పోలింగ్ రోజున ఓటు హక్కు కలిగి ఉన్న వారు నిర్ణీత సమయంలోపు ఓటు వేసేందుకు వీలుగా వారికి విధులకు ఆలస్యంగా హాజరు కావడానికి అనుమతించడం, షిఫ్ట్ల సర్దుబాటు, తక్కువ పని గంటలు కేటాయించడం వంటి వెసులుబాటు కల్పించాలని కలెక్టర్  ఆయా యాజమాన్యాలకు సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తూ పట్ట భద్రులు, ఉపాద్యాయుల కరీంనగర్ నియోజక వర్గానికి చెందిన ఉద్యోగులు ఓటుహక్కు కలిగియున్న వారు వారి ఓటును వినియోగించుకొనుటకు ప్రత్యేక సాధారణ సెలవు ప్రకటించడం జరిగిందని, ఆయా కార్యాలయాల అధికారులు అట్టి సెలవును మంజూరు చేయవలసిందనీ తెలిపారు.