20-04-2025 12:04:42 AM
రిక్టర్ స్కేల్పై 5.8గా నమోదు..
86 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం...
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో శనివారం మధ్యాహ్నం భూమి కంపించింది. కశ్మీర్, ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో దీని ప్రభావం కనిపించింది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(ఎన్సీఎస్) ప్రకారం మధ్యాహ్నం 12.17 గంటలకు ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంప కేంద్రం 86 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు ఎన్సీఎస్ పేర్కొంది.