calender_icon.png 1 April, 2025 | 8:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముందస్తుగా ఉగాది వేడుకలు

29-03-2025 01:28:23 AM

కాటారం, మార్చి 28 (విజయక్రాంతి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గారేపల్లి లోని అయ్యప్ప దేవాలయం కాలనీ లో శుక్రవారం ముందస్తు ఉగాది పండుగ వేడుకలు నిర్వహించారు. ఉదయం 11 గంటలకు అయ్యప్ప వాడలో మహిళలు అందరూ కలిసి  ముందస్తుగా ఉగాది పండుగ వేడుకను నిర్వహించుకున్నారు. అందరూ సేకరించిన సామాగ్రిని పడకంటి అంజలి ఇంటి వద్ద నుండి శ్రీ హర్షిత డిగ్రీ కాలేజ్ వరకు తీసుకు వెళ్ళారు.  కాలేజీలో  షడ్రుచులలో కూడిన ఉగాది పచ్చడిని తయారు చేసారు. మహిళలంతా భక్తి శ్రద్ధలతో పాటలు పాడి పూజలు నిర్వహించి అనంతరం ఉగాది పచ్చడి ,  భక్ష్యాలను అందరూ స్వీకరించారు. కాలనీలోని పలువురికి ఉగాది పచ్చడిని, భక్ష్యాలను పంచారు. ఒకరికి ఒకరు ఉగాది శుభకాంక్షలు తెలుపుకున్నారు.

ఈ కార్యక్రమం నిర్వహించిన పడకంటి అంజలికి పలువురు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్పగుడి పురోహితురాలు దండూరి పద్మ, రామగిరి శ్రీదేవి, లక్కాకుల మాధవి, కుంభం రాజేశ్వరి, పడకంటి అంజలి, కవ్వాల కళ, మొగిలి స్వప్న, సాంబ్రాతి స్వప్న, కలికోట కల్పన, నడిపెల్లి సంధ్య, అయించ లహరి, భీమారపు పద్మ, దారం జ్యోతి, కముటాల రాధ, అందె సంధ్య, సంతోషం సంధ్య, తాటి విజయ, శనిగరం సుజాత, మద్ది సుజాత, మద్ది నీరజ, బీరెల్లి పావని  పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి, కార్యక్రమానికి సహకరించిన మాజీ ఉపసర్పంచ్ నాయిని శ్రీను కు, సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమ నిర్వాహకులు పడకంటి అంజలి కృతజ్ఞతలు తెలిపారు.