calender_icon.png 22 February, 2025 | 12:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్దేశిత పనులను ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

19-02-2025 01:20:44 AM

ఓదెల, ఫిబ్రవరి 18: నిర్దేశిత పనులను మండలాల్లో ప్రతి అధికారి సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్   కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం  జిల్లా కలెక్టర్  ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ఓదెల మండలం కొలనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొలనూర్, నాంసాని పల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, పోత్కపల్లి  గ్రామంలోని  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వ్యవసాయ సహకార సంఘం, ఓదెల మండల కేంద్రంలోని కేజీబీవీ ,ఎంపిడిఓ , తహసిల్దార్ కార్యాలయం,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లను తనిఖీ చేశారు. 

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల తనిఖీ తర్వాత  జిల్లా కలెక్టర్   మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎన్.సి.డి సర్వే పూర్తి చేయాలని అన్నారు. వైద్యశాఖ పరిధిలో చేపట్టే ప్రతి కార్యక్రమం పై ఆశా లకు సంపూర్ణ అవగాహన ఉండాలని అన్నారు. టీబీ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి  ఎక్స్ రే తీయించాలని అన్నారు.  ఏ.ఎన్.సి రిజిస్ట్రేషన్ మహిళలను రెగ్యులర్ గా మానిటర్ చేయాలని అన్నారు. అంగన్వాడి కేంద్రాలలో పోషక లోపంతో ఉన్న విద్యార్థులను మానిటర్ చేస్తూ వారి ఎదుగుదలకు కృషి చేయాలని, ఆర్.బి.ఎస్.కే ద్వారా పరీక్షల నిర్వహించి ఆసుపత్రికి రిఫర్ అయిన పిల్లల ఆరోగ్య పరిస్థితు లను రెగ్యులర్ మానిటరింగ్ చేయాలని, పాఠశాలల తనీఖీలలో కొలనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంజూరు చేసిన  పనులను వెంటనే ప్రారంభించాలని, నాంసానిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో  వరద నీరు నిలవకుండా ముందు ప్లాట్ఫారం నిర్మించాలని, పోత్కపల్లి  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డయాస్ నిర్మాణం, ఇతర మరమత్తు పనులు చేపట్టాలని అన్నారు.

ఓదెల కస్తూర్బా గాంధీ విద్యాలయంలో రెండు అదనపు తరగతి గదులు, అవసరమైన టాయిలెట్స్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని  సూచించారు.  ఓదెల ఎంపీడీవో కార్యాలయంలో త్రాగునీటి సరఫరా అధికారులతో కలెక్టర్ సమీక్షించి రాబోయే వేసవి కాలంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, జిల్లాలో అవసరమైన మేర యూరియా అందుబాటులో ఉందని, పోత్కపల్లి వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైతే ఇండెంట్ పెట్టి జిల్లా నుంచి తెచ్చుకోవాలని, రైతులకు యూరియా గురించి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాలని, ఈ- పాస్ యంత్రాల ద్వారా పారదర్శకంగా యూరియా విక్రయం జరగాలని తెలిపారు. ఈ తనిఖీల్లో జిల్లా కలెక్టర్ వెంట తాహసిల్దార్ సునీత,ఎంపీడీవో తిరుపతి, ఎంఈఓ రమేష్, ఏ ఈ పి ఆర్ జగదీష్, మండల వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్, ప్రాథమిక ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సంజనేష్ కుమార్ , ప్రోగ్రాం అధికారి డాక్టర్ సుధాకర్,  సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.