calender_icon.png 22 April, 2025 | 7:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్వాక్రా మహిళలకు టోకరా!

11-12-2024 12:46:50 AM

  • రూ.కోటిన్నర నొక్కేసిన ఐకేపీ సిబ్బంది
  • మహిళలు చెల్లించిన కీస్తీల డబ్బు సొంతానికి?
  • రూ.కోటిన్నరకు రూ.రెండు కోట్ల వడ్డీ 
  • ఆందోళనలో మహిళలు

కామారెడ్డి, డిసెంబర్ 10 (విజయక్రాం తి): బ్యాంకు నుంచి మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలకు నెల నెలా కిస్తీలు చెల్లిస్తున్నా.. ఆ డబ్బులు డీఆర్‌డీఏ , ఐకేపీ సిబ్బంది బ్యాంక్‌లలో జమ చేయకుండా సొంతానికి వాడుకున్నారు. రుణాలు చెల్లించడం లేదని బ్యాంకు అధికారులు మహిళా సంఘాలను ప్రశ్నించడంతో అస లు విషయం బయటపడింది. కామారెడ్డి జిల్లాలోని భిక్కనూర్, తాడ్వాయి, కామారెడ్డి, లింగంపేట్, పిట్లం, జుక్కల్, మాచారెడ్డి, పోతంగల్, నస్రూల్లాబాద్, మద్నూర్, బిచ్కుంద, దోమకొండ మండలాల్లోని గ్రామాల్లో మహిళా సంఘాలు బ్యాంక్‌ల ద్వారా స్త్రీ శక్తి రుణాలను తీసుకుని వాయిదాల ప్రకారం ఐకేపీ సిబ్బందికి చెల్లించారు.

వారు బ్యాంక్‌లో జమ చేయకుండా సొంతానికి వాడుకున్నారు. ఈ విషయం బయటప డిన తర్వాత మహిళలు ఐకేపీ పీడీకి, డీపీఎంలకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదు. రికవరీ చేయిస్తామని చెప్పి చేతులు దులుపుకున్నారు. కానీ ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా బ్యాంకుల్లో జమ చేయించలేదు. మహిళ సంఘాల పేరు మీద తీసుకున్న రుణాలకు వడ్డీలను మాత్రం జమ చేస్తున్నారు. సకాలంలో బ్యాంకులలో చెల్లించకపోవడంతో చక్రవడ్డీలను బారు వడ్డీలు వేసి మహిళలను ఆందోళనకు గురి చేస్తున్నారు.

జిల్లా కలెక్టర్ స్పందించి డ్వాక్రా మహిళల గ్రూప్‌లపై పర్యవేక్షించాల్సిన ఏపీఎంలు, సీసీలు,వీవోఏలు, డీపీఎంలు నిర్లక్ష్యం వల్లనే పెద్ద మొత్తంలో డబ్బులు కాజేశారు. ఇన్ని డబ్బు లు కాజేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేయడంలో అంతర్యం ఏమిటోనని ప్రశ్నిస్తున్నారు. తాము రోజు వారిగా కూలీ పనులు చేసి సంపాదించిన కూలీ డబ్బులను నెల నెల వాయిదా రూపంలో చెల్లిస్తే వాటిని సీసీ లు, వీవోలు కాజేసి ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికా రులు మాత్రం రుణాలకు సంబంధించిన డబ్బులను కాజేసిన సిబ్బందిపై మాత్రం ఆర్ ఆర్ యాక్ట్ పెట్టి వారి ఆస్తులను ఆటాచ్ చేసి వాటిని అమ్మి బ్యాంకుల్లో కట్టాల్సిన డబ్బులను కట్టించాలని మహిళలు కోరుతున్నారు. 

అధికారులతో కుమ్మక్కు?

అధికారులతో కుమ్మక్కై డబ్బులు కాజేసిన సిబ్బంది పర్సెంటీజీలు ఇవ్వడంతోనే వారిపై చర్యలు తీసుకోవడానికి పీడీ అధికారులు వెనుకంజ వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనంతటికి కారణం కేవలం డీఆర్‌డీఏ శాఖ అధికారుల అసమర్థత, అవినీతి, కారణమేనని తెలుస్తున్నది. ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ నిందితులపై చర్యలు తీసుకోవాలని మహళలు కోరుతున్నారు. లేదంటే తాము నష్టపోతామని, తమ ఆస్తులను అటాచ్ చేసే అవకాశలు ఉన్నాయని వాపోతున్నారు. 

మండలాల వారీగా..

కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌లో వీవోఏలు, బుక్ కీపర్‌లు మహిళల పేరు మీ ద రుణాలు తీసుకుని వారి సొంతానికి రూ.20 లక్షలు వాడుకున్నారు. కామారెడ్డి మండలం నర్సన్నపల్లిలో రూ.40 లక్షలు వీవోఏ కాజేసింది. ఎర్రపహడ్ బ్యాంకులో నందివాడకు చెందిన రూ. 35లక్షలు స్వాహా చేశారు. జిల్లా మహ్మద్‌నగర్ మండలం అన్సన్‌పల్లి గ్రామం లో 25 సంఘాల సభ్యుల రూ.36 లక్షలు సర్వీస్ సెంటర్ నిర్వాహకులు, సీసీలు స్వాహా చేశారు.

మూడేళ్లుగా ఈ డబ్బులు చెల్లించకపోవడంతో ఇప్పుడది రెండు కోట్ల రూపాయిలకు పైగా వడ్డీలు పెరిగి మహిళలపై భారం పడుతుంది. ఎవరు స్వాహా చేశారనే విషయం పక్కగా అధికారుల విచారణలో బయటపడ్డప్పటికీ వారిపై చర్యలు తీసుకోవ డంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటికైనా డీఆర్డీఏ అధికారులు కళ్లు తెరిచి డబ్బులను రికవరీ చేయాలని మహిళలు కోరుతున్నారు.
 
అక్రమార్కుల ఆస్తులు జప్తు చేస్తాం

కామారెడ్డి జిల్లాలో మహిళా సంఘా ల డబ్బులను స్వాహా చేసిన అక్రమార్కు ల వివరాలను సేకరిస్తున్నాం. ఇప్పటికే ముగ్గురు సీసీలను గుర్తించి విధుల నుం చి తొలగించాం. నోటీసులు కూడా జారీ చేశాం. వారి ఆస్తులను జప్తు చేస్తాం. ఎవరెవరికి ఈ అక్రమాలలో భాగస్వామ్యం ఉందనే విషయాలను సేకరిస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
 సురేందర్, డీఆర్డీయే పీడీ, కామారెడ్డి