అనంతపురం: ఈ ఏడాది దులీప్ ట్రోఫీ విజేతగా ఇండియా ఏ జట్టు అవతరించింది. మూడో రౌండ్ మ్యాచులో ఇండియా సీ మీద 132 పరుగుల తేడాతో విజయం సాధించిన ఏ జట్టు రెండు విజయాలతో అగ్రస్థానంలో నిలిచి ట్రోఫీని ఒడిసిపట్టింది. ఏ జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ట్రోఫీని అందుకున్నాడు.
ఎట్టకేలకు
ఇండియా డీ జట్టు ఎట్టకేలకు విజయం సాధించింది. మూడో రౌండ్లో ఇండియా బీతో జరిగిన మ్యాచ్లో 257 పరుగుల తేడాతో విజయం సాధించింది. అర్షదీప్సింగ్ (6/40) ధాటికి బీ జట్టు 115 పరుగులకే చాప చుట్టేసింది. కానీ మూడు మ్యాచుల్లో ఒకే ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.