calender_icon.png 29 September, 2024 | 1:01 PM

యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి: శ్రీనుబాబు

29-09-2024 10:06:45 AM

శ్రీపాద మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం లో శ్రీను బాబు

మంథని,(విజయక్రాంతి): మంథని నియోజకవర్గంలోని కాటారం మండలం దన్వాడ గ్రామంలో యూత్ కాంగ్రెస్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీపాద స్మారక DPL - 9 మెగా క్రికెట్ టోర్నమెంట్ ను కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు దుద్ధిళ్ల శ్రీను బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని అందుకు వారి తల్లిదండ్రులు కూడా సహకరించాలని శ్రీనుబాబు కోరారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగించడమే కాకుండా వ్యక్తిత్వాన్ని పెంపొందిస్థాయని, యువత చెడు అలవాట్లకి దూరంగా ఉండి చదువులోనే కాకుండా క్రీడల్లోను ఉన్నత శిఖరాలని అధిరోహించి తమ తల్లిదండ్రులు, మన ప్రాంతం గర్వపడేలా కష్టపడలని సూచించారు. క్రీడల వలన మానసిక ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉందని, కావున అందరు సాధ్యమైనంత వరకు క్రీడలో అయిన రోజులో కొంత సమయం కేటాయిస్తే ఆరోగ్యవంతంగా జీవించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.